తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ పథకాలు వజ్రాల్లాంటివని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కాలంలోనూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు అహర్నిశలు పని చేశారని, అలా పనిచేయడం వల్లే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ నే మించిపోవడం అసాధారణ విజయం అని మంత్రి తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాల్లో రైతుబంధుది ప్రత్యేక స్థానం అన్నారు. మొత్తం అన్ని విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు ఇచ్చిన డబ్బు 50 వేల కోట్లు అని పేర్కొన్నారు. చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతుకు ఇంత లబ్ది చేకూర్చలేదన్నారు. ప్రపంచంలోనే ఇది వినూత్నం అని కొనియాడారు. ఏటా దాదాపు 60 వేల కోట్లు ఒక్క వ్యవసాయ రంగం మీదనే ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు వారోత్సవాలని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో రైతుబంధు పథకంపై అధికారులు ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సంధర్భంగా రైతుబంధు సంబరాల కరపత్రాన్ని మంత్రి విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ప్రత్యేక కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- లోక్సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు
- బండి సంజయ్కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టింది: కేటీఆర్
- మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్లో కేసీఆర్ పోస్ట్
- రేవంత్కు దమ్ముంటే హరీష్ రావు సవాల్కు స్పందించాలి: కేటీఆర్
- 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం.. నేడు దేశానికి ఆదర్శం: హరీష్ రావు