స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా విద్యార్థులకు రాష్ట్రంలోని 563 స్క్రీన్స్ లో నేడు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల గురించి విద్యార్థులకు తెలియ జేయాల్సిన బాధ్యతలో భాగంగా గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో ప్రదర్శింప చేస్తున్న ఈ చిత్రాన్ని వీక్షించేందుకు విద్యార్థుల రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేస్తోంది. కాగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో విద్యార్థులతో కలిసి వీక్షించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి టాకీస్లో పిల్లలతో కలిసి కొద్దిసేపు గాంధీ సినిమాను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప నేత గాంధీజీ అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు.గాంధీజీ మార్గం మనందరికి అనుసరణీయమన్నారు. ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారు. మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న స్వాతంత్ర వజ్రోత్సవాలలో పాల్గొనాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
- 6 reasons why the Congress can’t fight the BJP
- How Congress secretly boosting BJP’s chances in 6 seats in Telangana, writes Padma Rao Goud
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే: హరీష్ రావు
- కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్గిరి కార్యకర్తలతో కేటీఆర్
- లోక్సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు
- బండి సంజయ్కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టింది: కేటీఆర్
- మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్లో కేసీఆర్ పోస్ట్